న్యూఢిల్లి : బ్యాంకులను వేల కోట్ల రూపాయిలు మోసగించి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా దాఖలు చేసిన ఒక పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు నోటీసులు జారీ చేసింది. తనను పారిపోయిన ఆర్థిక నేరగాడుగా ప్రకటించాలంటూ ముంబై కోర్టులో సాగుతున్న ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ మాల్యా పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు ఇ.డి.కి నోటీసులు జారీ చేసింది. అయితే ముంబై కోర్టులో సాగుతున్న ప్రొసీడింగ్స్పై స్టే విధించడానికి నిరాకరించింది.