న్యూఢిల్లి : కేంద్రమంత్రి అరుణ్ జైట్లీపై ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్కు 50 వేల రూపాయిల జరిమానా వేసింది. ఆర్బీఐ రిజర్వ్ నిధులకు సంబంధించి జైట్లీపై పలు ఆరోపణలు చేస్తూ ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. న్యాయవాది జరిమానా చెల్లించే వరకూ ఇతర పిటిషన్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అనుమతించబోదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్,జస్టిస్ ఎస్కె కౌల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.