రిషికేష్: ప్రముఖ పర్యావరణవేత్త, గంగానదీ ప్రక్షాళన కార్యకర్త జీడీ అగర్వాల్ చనిపోయిన రెండు రోజులకే మరో సాధు గోపాల్దాస్(36) ను రిషికేశ్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అత్యవసర విభాగంలో అతనికి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి సుపరిటెండెంట్ బిజేంద్రసింగ్ తెలిపారు. గోపాల్దాస్కు చికిత్స అందిస్తున్న వైద్య బృంద అధిపతి డాక్టర్ మీనాక్షిదార్ మాట్లాడుతూ.. బాధితుడు డీహైడ్రేషన్తో బాధపడుతున్నట్లు తెలిపారు. షుగర్ లెవల్స్ పడిపోయాయి. ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం లేదు. చికిత్సకు స్పందించడం లేదు. ప్రస్తుతం బలవంతంగా ఫ్లూయిడ్స్ను ఎక్కిస్తున్నట్లు వెల్లడించారు. గంగానది తీరంలో మైనింగ్ను వ్యతిరేకిస్తూ గోపాల్దాస్ ఆందోళనకు దిగారు. రిషికేష్లోని త్రివేణి, బాగ్ ఘాట్లలో జూన్ 24వ తేదీ నుంచి ఆయన ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.