మండపేట మండలవ్యవసాయ శాఖ ఏ ఈ ఓ గా విధులు నిర్వహిస్తున్న నక్కా సంధ్య అవార్డు అందుకున్నారు. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి కాల్వ శ్రీనివాస్ అవార్డు అందజేశారు.జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సమక్షంలో పురస్కారం అందుకున్నారు. జిల్లాలో మొత్తం 112 మంది ఏ ఈ ఓ లు వ్యవసాయ శాఖ లో పనిచేస్తుండగా ఈమెకే ఉత్తమ పురస్కారం దక్కడం విశేషం. మండలం లోని రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందివ్వడం ద్వారా రైతుల ప్రశంసలు అందుకున్నారు. ఈ శాఖ లో ఆమె చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి అవార్డు అందజేసింది. సంధ్య కు పురస్కారం లభించడం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆలమురు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏ డి సి హెచ్ కెవి చౌదరి, మండపేట వ్యవసాయ శాఖ అధికారీ బలుసు రవి లు అభినందించారు.