ఓ విద్యార్థిని గొంతులో ఇడ్లీ చిక్కుకొని మృతి చెందిన ఘటన నాగర్కోవిల్లో చోటుచేసుకుంది. వివరాల మేరకు... నాగర్కోవిల్ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చెందిన జయ్లాణి, ఇర్ఫానాల కుమార్తె అఫ్రిన్ (13). అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. గురువారం ఉదయం తల్లితో కూర్చొని మాట్లాడుతూ.. నవ్వుకుంటూ ఇడ్లీ తింటుంది. ఆ సమయంలో గొంతులో ఇడ్లీ చిక్కుకుంది. ఊపిరి తీసుకోలేక కొంతసేపు ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు సమీపంలోనున్న ఆస్పత్రికి తరలించారు. మార్గమద్యలోనే అఫ్రిన్ మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.