విశాఖపట్నం పూర్ణ మార్కెట్ 35 వ వార్డు అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ అనుకొని ఆయిల్ వారి వీధిలో ఎం సంతోష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్థ రాత్రి మెడ పై కత్తితో దాడి చేశారు. దింతో సంతోష్ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. ఈ విషయంపై ఆయిల్ వారి వీధిలో స్థానికులు పోలీసులకు తెలియజేశారు. విశయం తెలుసుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా సంతోష్ మృతికి ప్రధాన కారణం వివాహేతర సంబంధమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ కోణంలో దర్యాఫ్తు ప్రారంభించారు. హత్య కేసుకు సంబందించి ఒక మహిళను పోలీస్ లు అదువులోకి తీసుకుని విచరిస్తునట్లు విశ్వసనీయ సమాచారం.