ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌

national |  Suryaa Desk  | Published : Fri, Apr 16, 2021, 05:02 PM

ఐపీఎల్ 14వ సీజన్‌ ఎనిమిదో మ్యాచ్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో తలబడనుంది. 7:30 గంటలకు ముంబై వాంఖెడే స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ధోనీ సేనకు ఈ సీజన్‌లో ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిపోయింది. ధోనీ డకౌట్, సామ్ కుర్రమ్ బ్యాటింగ్ మెరుపులు ఆ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాయి. 188 పరుగుల భారీ స్కోర్‌ను సాధించినప్పటికీ ఓటమి నుంచి బయటపడలేకపోయింది.


మరోవైపు పంజాబ్ కింగ్స్ టీమ్ కూడా అక్కడే గత సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడి 4 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో ఈరోజు మ్యాచ్‌లో పంజాబ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com