ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కి చేరింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటలలోపు 12 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా వ్యాప్తి నివారణ కోసం సర్కార్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరగడం కలవరానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా వైరస్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 15, చిత్తూరు 23, తూర్పుగోదావరి 17, గుంటూరు 90,కడప 31, కృష్ణా 36, కర్నూలు 84, నెల్లూరు 52,ప్రకాశం 41, విశాఖ పట్నం 20, పశ్చిమ గోదావరి 23,విజయనగరం,శ్రీకాకుళంలో 0 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కొత్తగా గుంటూరు లో 8, చిత్తూరు లో 2, కృష్ణ మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 12 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 432 కి పెరిగింది. చిత్తూరు,తూర్పు గోదావరి,నెల్లూరు,ప్రకాశం నుంచి ఒక్కొక్కరు, విశాఖపట్నం, కృష్ణా నుంచి నలుగురు డిశ్చార్జి అయ్యారు.