ప్రజాసమస్యల పరిష్కారం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామం లో జరిగిన మండల పార్టీ సమావేశం లో ఆయన పాల్గొన్నారు. పలు గ్రామ కమిటీలను ఎన్నుకోవడం తో పాటు… పార్టీ తరఫున భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. రాజధాని తోపాటు పోలవరం వంటి ప్రాజెక్టులను ఆపేశారని విమర్శించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.