పొదిలి పట్టణంలోని సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి నగరబాటను ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన పట్టణంలోని 1,2,3 వార్డులలో తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సాయిరాజేశ్వరరావు, గుజ్జుల సంజీవరెడ్డి, కళ్లం సుబ్బారెడ్డి, గొలమారి చెన్నారెడ్డిలు, జి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.