గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు ఆపార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిశారు. వైకాపా నేతల అరాచకాలు పెరిగాయని చంద్రబాబుకు తెలిపారు. వాన్ పిక్ భూముల కుంభకోణంలో పోరాడినందుకు కక్ష కట్టారని వెల్లడించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ కక్ష సాధిస్తున్నారని రేపల్లె తెదేపా కార్యకర్తలు చంద్రబాబుకు తెలిపారు.