మాతృభాష విలువ తెలియని వ్యక్తులు... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని విమర్శించడం విడ్డూరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెలుగు భాష, యాస, ప్రాస, సంస్కృతి, ఉపన్యాసాలంటే... ప్రపంచమంతా గుర్తుకు వచ్చేది వెంకయ్యనాయుడు అని సోమిరెడ్డి గుర్తు చేశారు. చిన్నప్పుడు 3 కి.మీ. కాలినడకన వెళ్లి ప్రభుత్వ స్కూలులో చదువుకుని... ఈ స్థాయికి వచ్చిన వెంకయ్యను చూసి సీఎం జగన్ నేర్చుకోవాలని సోమిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.