పెనగలూరు మండలం అనంతంపల్లి పంచాయితీ నందు ఇంటింటి ప్రచారంలో శుక్రవారం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ముక్కా రూపానంద రెడ్డి బార్య వరలక్ష్మి, కోడలు రిషిక రెడ్డి, కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించి గ్లాసు గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ ను, కమలం గుర్తుకు ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు.