తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవనున్నారు. ఉదయం ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏపీ భవన్ కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి చంద్రబాబుతో పాటు నేతలంతా పాదయాత్ర చేస్తూ రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై, విభజన హామీలు అమలు చేయకపోవడంపై వినతిపత్రం సమర్పించనున్నారు. రాష్ట్రపతిని చంద్రబాబు నేతృత్వంలో 17 మంది ప్రతినిధుల బృందం కలవనుంది