కొరిశపాడు, రేణింగివరం గ్రామాల జాతీయ రహదారిపై గురువారం వేకువ జామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా కారు టైరు పగిలి డివైడర్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తెనాలి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి, తిరిగి ఒంగోలు చేరుకుంటున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులని వెంటనే ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.