శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కుమారుడి ప్రాణాలు తీసి.. ఆపై ఆయన కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. లాభాం గ్రామానికి చెందిన పప్పల అప్పలనాయుడు(40) భార్య ఆరు నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో కుమారుడు రేవంత్ (12) బాగోగులు చూసుకునేవారు లేకుండా పోయారు. దీంతో అప్పటి నుంచి కుమారుడిని పాఠశాలకు పంపడం మానేశారు. ఆయనతో పాటు పొలం పనులకు తీసుకెళ్లేవారు. ఎమైందో తెలియదు కానీ అప్పలనాయుడు బుధవారం కుమారుడికి ఉరి వేసి ప్రాణాలు తీసిన అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.