హిందూపురం పట్టణంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకులు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో హిందూపురం నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి తోడ్పాటు నిచ్చే అభ్యర్థులకే మద్దతు తెలియజేస్తామని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉర్దూ కళాశాల నిర్మించాలని డిమాండ్ చేశారు.