మర్రిపూడి మండలంలోని రాజుపాలెంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా కారులో తరలిస్తున్న 26 మద్యం సీసాలను స్క్వాడ్ సిబ్బంది బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నెల్లూరుకు వెళ్తున్న కారులో పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎన్నికల స్క్వాడ్ ఇన్ఛార్జ్ సయ్యద్ హుస్సేన్ తెలిపారు.