ఒంగోలు నగరంలోని కబడి పాలెంలో గురువారం టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యులు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీనివాసులు రెడ్డి, జనార్దన్ లను గెలిపిస్తే ఒంగోలు నగరంలో రోజు మంచినీళ్లు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దామచర్ల హిమబిందు, లక్ష్మి, గుత్తా మాధవి పాల్గొన్నారు.