ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి ఏపీ సర్కార్ శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 12:56 PM

ఏపీలో పింఛన్‌ లబ్ధిదారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్‌ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచి మరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. చాలా సులభంగా పింఛన్‌ను మార్చుకోవచ్చిని తెలిపారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.


అంతేకాదు రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అనర్హులకు పింఛన్‌ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనున్నారు. అలాగే పింఛన్ల సొమ్మును దుర్వినియోగ పరచడం..పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ అకౌంట్‌లో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. సచివాలయంలోనే ఈ వెసులుబాటు కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com