ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఉపరాష్ట్రపతి చే నీలకంఠాపురం దేవస్థానముల పాట విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 12:51 PM

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం దేవస్థానములు పై ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సంగీత ద‌ర్శ‌త‌క్వంలో ప్రముఖ తెలుగు కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పాట జయ మంగళం నిత్య శుభ మంగళం”ను , సుమారు 600 కి పైగా పాటలు రాశారు. పేరడీలు పాటలు రాయడంలో ప్రసిద్ధుడు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాసిన ”జయ మంగళం నిత్య శుభ మంగళం” పాటను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చే విడుదల చేయడం జరిగింది. ఈ పాటను గాయకులు (భారతీయ గాయకుడు కె. జె. ఏసుదాసు) కొడుకు విజయ్ జేసుదాస్, డాక్టర్ వందేమాతరం శ్రీనివాస్, నాద ప్రియ పాడారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, నీలకంఠాపురం దేవస్థానముల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ , మడకశిర మాజీ శాసనసభ్యుడు సుధాకర్ , అంబటి రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com