కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా గ్రాండ్ సక్సెస్ ను పొందారు యువ హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్. "18 పేజెస్" సినిమాతో మరోసారి ఈ జంట వెండితెరపై సందడి చేయనుంది.
దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ జరుగుతుందని తెలుపుతూ ఆన్ లొకేషన్ పిక్ ఒకటి షేర్ చేశారు. అలానే డిసెంబర్ 23వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుందని పేర్కొంటూ మరొక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
జీనియస్ డైరెక్టర్ సుకుమార్ అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. పోతే, ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్టర్ కాగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.