బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నేడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.