కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి దేశ చరిత్ర, భూగోళశాస్త్రం గురించి తెలియదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. రాహుల్ను లక్ష్యంగా చేసుకున్న కేంద్రమంత్రి..సినీ హీరోల్లాగా రాసిచ్చిన స్క్రిప్టు మాత్రమే రాహుల్కు చదవడమొచ్చు అని పేర్కొన్నారు. చరిత్ర, భూగోళశాస్ర్తానికి సంబంధించి ఆయనకు కనీస పరిజ్ఞానం కూడా లేదన్నారు కేంద్రమంత్రి. కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగం ఎక్కువగా ఉండేదన్నారు. తమ ప్రభుత్వం పీఎం ముద్ర పథకం కింద 9 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు గిరిరాజ్ సింగ్. ఈ మూడేళ్ల పాలనలో ప్రధాని మోదీ అవినీతికి తావు ఇవ్వలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు స్పందించారు. కేంద్రమంత్రి అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి అడుగంటి పోయిందన్నారు. కేవలం ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.