వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం మూలేవారి పల్లెకు చెందిన మూలే రామక్రిష్ణరెడ్డి కుమారుడు మూలే మునిశ్రీధర్ రెడ్డి (21)అనే యువకుడు అనుమానస్పద మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు నెల్లూరు జెనెక్స్ విజన్ కాలేజీ లో చదువుతున్నాడు. మునిశ్రీధర్ రెడ్డి గత రాత్రి నెల్లూరు కావలి రైల్వే లైన్ పై అనుమానస్పద మృతి చెందిన ఘటన జరిగింది. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.