బిల్లులు ఇవ్వకుండా రికవరీ పెడతారా సోమిరెడ్డి ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఒక్కో పనికి 96 శాతం రికవరీ ఎలా పెడతారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ టిడిపి హయాంలో రూర్బన్ పనులను నాణ్యతతో చేపట్టామన్నారు.
రూ. 16 లక్షల పనికి రూ. 58 వేలు ఇస్తారా, అవి కూడా మీరే ఉంచుకోండని సూచించారు. పనులు చేసిన వారెవరూ అరకొర బిల్లులు తీసుకోవద్దని హైకోర్టులో తేల్చుకుందామని చెప్పారు. బిల్లులు చెల్లించకుండా వేధిస్తోన్న ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులను కోర్టు మెట్లు ఎక్కిస్తామని హెచ్చరించారు.