ఓ వివాహితను ఆమె మాజీ ప్రియుడు హతమార్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన ప్రియదర్శిని జగన్నాథ్ ప్రేమించుకున్నారు. కాలేజీలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకు వీరికి విబేధాలు రావడంతో ప్రియదర్శిని జగన్నాథ్ ను దూరం పెట్టింది. ఆ తర్వాత 2015లో ఆమె రాకేష్ ను పెళ్లి చేసుకుంది. వీరికి 3 సంవత్సరాల బాలుడున్నాడు. రాకేష్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. వీరు భువనేశ్వర్ లోనే ఓ ప్లాట్ లో నివాసం ఉంటున్నారు. ప్రేమికురాలు వేరే పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి ప్రియదర్శిని పై జగన్నాథ్ పగ పెంచుకున్నాడు. పలుమార్లు ప్రియదర్శిని కలిసి తనతో రావాలని వేధించాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను చంపి తాను చావాలని ఫిక్స్ అయ్యాడు.
జూలై 5న జగన్నాథ్ ప్రియదర్శిని ఉంటున్న ఫ్లాట్ కు వచ్చాడు. ఆ సమయంలో ఆమె ఒక్కతే ఇంట్లో ఉంది. కుమారుడు పక్క ఇంట్లో ఉన్నాడు. జగన్నాథ్ ప్రియదర్శిని పై కత్తితో దాడి చేసి హతమార్చాడు. జగన్నాథ్ కూడా కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. . ఆ తర్వాత ఫోటోలను భర్త రాకేష్ కు పంపాడు. దీంతో షాకైన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగన్నాథ్ కు ఓ ఆస్పత్రిలో చికిత్స అందించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్నాథ్ తన సూసైడ్ లెటర్ కూడా రాసుకున్నాడు. ప్రియను చంపి తాను చస్తానని అందులో ఉంది.