దేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు తగ్గినా మరణాల సంఖ్య మాత్రం భారీగా పెరిగాయి. తాజాగా 31,443 కేసులు నమోదు కాగా, వైరస్ బారన పడి 2020 మంది ప్రాణాలు విడిచారు. నిన్న నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 118 రోజుల కనిష్టానికి చేరాయి. గత కొన్ని రోజులుగా 1,000 లోపు నమోదవుతున్న మరణాలు ఒక్కసారి భారీగా పెరిగాయి. నిన్న 49,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 4,32,778 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.