బాపట్ల పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి నందిగం సురేశ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని స్వతంత్య్ర అభ్యర్థి కట్టా ఆనంద్బాబు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను అమరావతి సచివాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. ‘నువ్వొక వలంటీర్వి. నా మీదే తిరుగుబాటు చేసే ధైర్యం నీకెవడిచ్చాడు? నామినేషన్ ఉపసంహరించుకోకపోతే మే 13లోపు నిన్ను చంపేస్తా. వచ్చే ఏడాది నా పేరు మీద సినామా తీస్తా’ అని సురేశ్, అతని అనుచరులు బెదిరిస్తున్నారని వివరించారు.