వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఆళ్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత మాట్లాడుతూ... సైకోగాళ్ల కుట్రలు ఉగ్రవాదుల కంటే మించిపోయాయని విమర్శించారు. టీడీపీ - జనసేన - బీజేపీ పొత్త పెట్టుకున్నాయని ఎన్నికల్లో జనసేనను డామేజ్ చేసేలా 54 నియోజకవర్గాల్లో గ్లాస్ ఫ్లంబర్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చేలా వైసీపీ కుట్రలు చేసిందని ఆరోపించారు. వైసీపీ వాళ్లు వివిధ వేషాల్లో వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారని.. వారి మాటల్ని నమ్మవద్దని కోరారు. మారీచుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉందని... వైసీపీ కుట్రలను సాగనివ్వమని స్పష్టం చేశారు. మాండ్ర శివానందరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మళ్లీ నందికొట్కూరు వస్తానని... విజయోత్సవాలు జరుపుకుందామని అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.