బి.కొత్త కోట నగర పంచాయతీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని టీడీ పీ, జనసేన, బీజేపీ నాయకు లు కోరారు. ఈ సందర్బంగా బి.కొత్తకోటలో విలేకర్లతో వారు మాట్లాడుతూ మంగళవారం (ఈనెల 30న) కిరణ్కుమార్రెడ్డి సాయంత్రం 3.00కు బెంగళూరు రోడ్డులోని షాదీమహల్లో మైనారిటీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహి స్తారన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి సైతం పాల్గొనే ఈ సమావేశంలో, బి.కొత్తకోట మండలంలోనే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా వున్న ముస్లిం మైనారిటీలు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్, శ్రీనివాసులు, బంగారు వెంకట్రమణ, గోరంట్ల రమేష్, రామదాసు, కావడి రవీంద్ర, ఫాజిల్, రాజాచాకనా, శివ, సురేంద్ర, ఇమాంసాబ్ తదితరులు పాల్గొన్నారు.