ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 25, 2021, 04:01 PM

వైసీపీ ప్రభుత్వం పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. నిజమేంటో జనానికి తెలిసేసరికి.. జగన్‌రెడ్డి సృష్టించిన అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయన్నారు. అసత్య ప్రచారమే పెట్టుబడిగా, తెచ్చుకున్న అధికారం అండతో.. అమరావతిపై పన్నిన మరో కుట్రని టీడీపీ బట్టబయలు చేసిందని చెప్పారు. ఫేక్ సీఎం ఆదేశాలతో, ఫేక్ ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో.. సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చారని ఆధారాలతో సహా బయటపెట్టామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజారాజధాని అమరావతిపై, టీడీపీపైనా జగన్‌రెడ్డి కుతంత్రాలు ఆపాలని లోకేష్‌ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com