ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం ముగిసింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఎస్ఈసీ స్పందించింది. పోలీసులకు చేసిన ఫిర్యాదులను ఆర్వోలు పరిశీలించాలని ఆదేశించామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఫోర్జరీతో తన నామినేషన్ ను ఉపసంహరించారంటూ తిరుపతి 7వ వార్డు అభ్యర్థి ఈసీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్ఈసీ జాయింట్ సెక్రటరీతో విచారణ జరుపుతున్నారు. బలవంతపు ఉపసంహరణల పైన కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరా తీస్తున్నారు.