విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించటాన్ని ఆహ్వానిస్తూ విశాఖ జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం గ్రామంలో ర్యాలీగా నిర్వహించారు. విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని తద్వారా పరిసరప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని నినాదాల చేశారు.