హైదరాబాద్: రెండు ప్రత్యేక విమానాల్లో కేసీఆర్ రేపు ఏపీకి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారికి చెల్లించాల్సిన మొక్కు చెల్లించుకుని, ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను సమర్పించుకునేందుకు ఏపీకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం రేణిగుంటకు చేరుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు మంత్రులు, వారి కుటుంబీకులతో కలసి రాత్రికి అక్కడ విశ్రమించి, బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ, శ్రీవత్సం విశ్రాంతి గృహాల్లో, మంత్రులకు, ఇతరులకు శ్రీ, లీలావతి, మణిమంజరి, టీఎస్ఆర్ గెస్టు హౌస్ లలో బస ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.