ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా ప్రపంచకప్‌లో భారత్ దూకుడు..వరుసగా మూడో విజయం

national |  Suryaa Desk  | Published : Thu, Feb 27, 2020, 01:38 PM

టీ20 ప్రపంచకప్‌లో మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో విజయంతో సెమిస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ రోజు జరిగిన ఉత్కంఠభరిత పోరులో న్యూజీలాండ్ పై 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా మహిళల జట్టు 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వెర్మ ఎప్పటిలాగే దూకుడుగా బ్యాటింగ్ చేసింది. 34 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. తానియా బాటియా 23 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు 6 వికెట్లు నష్టపోయి 130 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 4 పరుగులతో టీం ఇండియా విమెన్స్ జట్టును విజయం వరించింది. న్యూజీలాండ్ బ్యాట్సెమెన్ అమెలియా కెర్ 19 బంతుల్లో 34 పరుగులు చేసి చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com