ఇన్నాళ్లు ఏ విమానాశ్రయంలోనో అక్రమ బంగారు రవాణాని పట్టుకోవటం విన్నాం. కానీ తాజాగా రైలులో అక్రమంగా బంగారంను తరలిస్తున్న ఘటన వెలుగు చూసింది. వివరాలలోకి వెళితేఒడిశాలోని జార్సుగూడ రైల్వే స్టేషన్ వద్ద జ్ఞానేశ్వరి సూపర్ డిలక్స్ ఎక్స్ప్రెస్ రైలులో బంగారం అక్రమంగా రవాణ అవుతున్నట్టు పక్కా సమాచారంతో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా భువనేశ్వర్ డీఆర్ఐ అధికారులు రైలును చెక్ చేసారు. దీంతో అనుమానంగా కనిపించిన ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. . నిందితుల వద్ద నుంచి 12.932 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.99 కోట్లు ఉంటుందని అధికారులు మీడియాకు తెలిపారు.