గుంటూరు : టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. యరపతినేనితో పాటు 12మందిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పిడుగురాళ్లకు చెందిన గురువాచారి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. నిందితులపై వెంటనే కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.