చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వైసీపీ సభ్యులు అవంతి శ్రీనివాస్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రెండో రోజు జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముందు ప్యాకేజీకి ఒప్పుకొని హోదా వద్దన్నారు. మళ్లిd యూటర్న్ తీసుకొని ప్యాకేజీ ముద్దన్నారు. చంద్రబాబు కాంగ్రెస్తో జతకట్టడం నచ్చకే తాను బయటకు వచ్చానన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమన్నారు. చంద్రబాబు సీనియర్ అని నమ్మితే.. ఆయన ఒంటెద్దు పోకడలకు పోయారన్నారు. ఎన్నికల్లో ఓటమిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఒంటెద్దు పోకడలు పోవడమే ఓటమికి కారణమన్నారు.