తీవ్రమైన కడుపునొప్పి వస్తోందని ఆసుప్రతికెళి చూపిస్తే, వైద్యులు ఆపరేషన్ చేసి స్పూన్ల, కత్తులు తదితరాలు బైటకు తీసిన ఘటన హిమాచల్ ప్రదేశ్లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే హిమాచల్ప్రదేశ్కు చెందిన 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తికి పదే పదే కడుపులో నొప్పి వస్తుండటంతో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అక్కడి శ్రీలాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించి, స్కానింగ్, ఎక్స్రేలు తీసిన వైద్యులు రిపోర్టులు చూసి షాక్కు గురయ్యారు. ఆ వ్యక్తి కడుపులో 8 స్పూన్లు, 2 స్క్రూడ్రైవర్లు, 2 టూత్ బ్రష్లు, ఒక కత్తి ఉన్నట్లు గుర్తించారు. మరుక్షణమే వైద్యులు.. అతనికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న స్పూన్లు, స్క్రూడ్రైవర్లు, టూత్ బ్రష్లు, కత్తి ఇతర సామగ్రిని బయటకు తీశారు. మానసిక స్థితి సరిగాలేని వారిలో కొందరు ఇలా తాము తీసుకునే ఆహారంతో పాటు లోహాలనుకూడా తినేస్తుంటారని డాక్టర్లు మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే అతన్ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.