బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ కోల్కతా ర్యాలీలో పాల్గోనున్నారు. అసోంలో జాతీయ పౌరసత్వ జాబితాను రిలీజ్ చేసిన తర్వాత .. షా బెంగాల్ టూర్ చేపట్టడం ఇదే మొదటిసారి. ఇదే అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత షా మధ్య మాటలయుద్ధం సాగిన విషయం తెలిసిందే. బెంగాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈ అంశాన్ని తన ర్యాలీలో షా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది కాలంలో.. షా బెంగాల్కు వెళ్లడం ఇది అయిదవ సారి. కోల్కతాలోని మాయో రోడ్డులో షా ర్యాలీ జరగనున్నది. వాస్తవానికి మొదట్లో ఈ ర్యాలీకి పర్మిషన్ రాలేదు. దాంతో షా ఓ సవాల్ చేశారు. నన్ను అరెస్టు చేసినా పర్వాలేదు, తాను మాత్రం కోల్కతా వెళ్లనున్నట్లు చెప్పారు. ఆ తర్వాతే కోల్కతా పోలీసులు ర్యాలీ కోసం అనుమతి ఇచ్చారు.