ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది : నాదెండ్ల మనోహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 05, 2023, 08:55 PM

జన సేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వారాహి యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.రేపు పోలవరంలో సీఎం జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో నాదెండ్ల మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసిందని ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.17,144 కోట్లు నిధులు ఇచ్చిందని నాదెండ్ల వెల్లడించారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిందని కేంద్రం చెప్పిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.పోలవరంలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com