ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన కాటసాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 03:59 PM

ప్రపంచంలోనే నంబర్‌ వన్‌  ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదన ఇంధన ప్రాజెక్టును మన జిల్లాకు ఇచ్చినందుకు పాణ్యం నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు . ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించేందుకు ముందుకు వచ్చిన గ్రీన్‌కో యాజమన్యాన్ని అభినందిస్తున్నాను. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో టీడీపీ నాయకులు ఈ ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేకపోయింది. మా నాయకుడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రైతులందరికీ పరిహారం ఇచ్చారు. ఏ రైతు కూడా ధర్నాలు చేయలేదు. కార్యాలయాల చుట్టూ తిరగలేదు. ఇంతగా ఆదుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు రైతుల తరఫున ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com