రాయదుర్గం మీదుగా ప్రయాణించే తిరుపతి-కదిరిదేవరపల్లి రైలును మూడు నెలల పాటు రద్దుచేసినట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. 07589 నెంబరు రైలును జులై 31 వరకు, 07590 రైలును ఆగస్టు 1వ తేది వరకు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కారణంగా ఈ రైలును రద్దు చేస్తున్నట్లు ప్రతి నెలా రైల్వే అధికారులు ప్రకటనలిస్తున్నారు. జనవరి నుంచి జులై వరకు ఈ రైలును పలు కారణాలతో రద్దు చేశారు.