శెట్టూరు మండల కేంద్రానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు అబ్దుల్లాతో పాటు మరో 53 కుటుంబాలు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మద్దతుగా అభివృద్ధి చేయగల సమర్థుడు అన్న నమ్మకంతో సురేంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి సురేంద్రబాబు టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అమిలినేని మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపిస్తే దుర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.