తలుపుల మండలం, బురుజుపల్లి గ్రామానికి చెందిన బ్రహ్మానందరెడ్డి కుమారుడు సాయినాథ్ రెడ్డి ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించిన విషయం తెలుసుకున్న కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రి మార్చరీకి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక వైసీపీ నాయకులు నివాళులర్పించారు.