భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే 4వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. దేశంలో వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18,26,490 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18 కోట్లకు చేరింది. గత 24 గంటల్లో 4,187 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2,38,270 కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉంది.