ఏపీలోని కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలంలోని మామిళ్లపల్లె శివారులో ఉన్న ముగ్గురాయి గనిలో ప్రమాదవశాత్తు పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అవ్వడంతో 10 మంది కూలీలు మృతిచెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్వారీలో ముగ్గురాయి వెలికి తీస్తుండగా పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.