ఏపీ ప్రభుత్వం కరోనా వైద్యానికి మరో కీలక జీవోను జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లను కరోనా పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు, ఎం ప్యానెల్ జాబితాలోని ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. ఎంప్యానెల్ కానీ ఆస్పత్రులను తాత్కాలిక ఎంప్యానెల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిలోనూ 50శాతం బెడ్లు కోవిడ్ ఉచిత, నగదు రహిత వైద్యం పొందే పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లోని అన్ని ఆసుపత్రుల్లో తక్షణమే 50 శాతం బెడ్లను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఆస్పత్రుల్లో ఇంకా బెడ్లు మిగిలి ఉంటే కరోనా పేషంట్లకు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్యమిత్ర, నోడల్ ఆఫీసర్ల పరిధిలోకి బెడ్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏ కరోనా పేషంట్ ను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించరాదని ప్రభుత్వం పేర్కొంది. కచ్చితంగా డాక్టరు అడ్మిషన్ సూచించిన వారిని చేర్చుకోవాలని ఆదేశించారు.