కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ 19 హోమ్ ఐసోలేషన్ నియమ నిబంధనల్ని తాజాగా సవరించింది. ఎలాంటి లక్షణాలు లేని కోవిడ్ 19 పాజిటీవ్ పేషెంట్లను హోమ్ ఐసోలేషన్ జాబితాలో చేర్చింది. సవరించిన నిబంధనల ప్రకారం హెచ్ఐవీ, క్యాన్సర్ థెరపీ, ట్రాన్స్ప్లాంట్ రోగులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కావున వారు హోమ్ ఐసోలేషన్కు అనర్హులు. వీరితో పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులు, ఇప్పటికే బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, శ్వాస సంబంధిత, ఊపిరితిత్తుల వ్యాధులు, లివర్, కిడ్నీ సమస్యల్లాంటి వ్యాధులు ఉన్నవారిని కూడా మెడికల్ ఆఫీసర్ కావాల్సిన పరీక్షలు జరపకుండా హోమ్ ఐసోలేషన్కు అనుమతించరు.కరోనా లక్షణాలు ప్రారంభమైన 10 రోజుల తర్వాత, వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేకపోతే హోమ్ ఐసోలేషన్ నుంచి పేషెంట్లను డిశ్చార్జ్ చేస్తారు. బాధితులు వారం రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ కావడంతో పాటు ఆరోగ్యాన్ని స్వయంగా మానిటర్ చేసుకోవాలని సవరించిన గైడ్లైన్స్ చెబుతున్నాయి. కోవిడ్ 19 లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ ను ఎంచుకోవచ్చు. అయితే ఆ పేషెంట్ల ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ కాకుండా సెల్ఫ్ ఐసోలేషన్ సదుపాయాలు ఉండాలి. కోవిడ్ 19 బాధితులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నన్ని రోజులు 24 గంటల పాటు సేవలు అందించడానికి సంరక్షకులు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. కోవిడ్ 19 పేషెంట్, సంరక్షకులతో పాటు వారి క్లోజ్ కాంటాక్ట్స్ మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్ ఉపయోగించాలి. దీంతో పాటు ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకొని నిత్యం బ్లూటూత్, వైఫై ఆన్లో ఉంచాల్సి ఉంటుంది. పేషెంట్లు తమ ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోవడంతో పాటు వివరాలను జిల్లా అధికారికి ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలి.